అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమానీ త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా అనౌన్స్ అయినా కూడా కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది.
అయితే మరల కరోనా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పాటు షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పటికే చాలా సినిమాలు షెడ్యూల్ స్టార్ట్ అయ్యాయి.థియేటర్లు కూడా 50 పర్సెంట్ ఆక్యుపేషన్ తో ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.
ఈ నేపధ్యంలో అన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్తున్నాయి. పుష్ప సినిమాని కూడా సుకుమార్ సెట్స్ పైకి తీసుకెళ్లడానికి షెడ్యూల్ వేసుకున్నారు.
అయితే లొకేషన్ విషయంలో ఇన్ని రోజులు కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది.ఈ సినిమా షూటింగ్ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.
ఈ నేపధ్యంలో కేరళ అడవులలో షూటింగ్ చేయాలని అనుకున్నారు.అయితే కరోనా పరిస్థితుల కారణంగా వికారాబాద్ అడవులలో షూటింగ్ చేయాలని అనుకున్నారు. చివరికి ప్రస్తుతం పుష్ప షూటింగ్ లొకేషన్ ఫైనలైజ్ చేశారు.తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో నెల రోజుల ఫస్ట్ షెడ్యూల్ తో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
నవంబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభపవుతుంది. ఇప్పటికీ కేరళలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో చివరి క్షణంలో వెనక్కి తగ్గి రంపచోడవరం వెళ్లడానికి దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు.
అక్కడ ఒక షెడ్యూల్ చేసిన తర్వాత, కేరళ వెళ్లాలని వారు ప్లాన్ చేస్తున్నారు.పరిస్థితుల ప్రభావం బట్టి షూటింగ్ కేరళలో చేయాలా లేదంటే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న అడవులని నమ్ముకోవాలా అనే విషయంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతానికి అయితే రంపచోడవరంలో షూటింగ్ స్టార్ట్ చేయడం అనేది ఫిక్స్ అయ్యింది.