తెలుగులో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు. అయితే ఆ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్, త్రిల్లర్, నగ్నం, తదితర చిత్రాలతో లాక్ డౌన్ సమయంలో కూడా ప్రేక్షకులని బాగానే ఎంటర్టైన్ చేశాడు.
కాకపోతే పవర్ స్టార్ చిత్రంతో పవన్ కళ్యాణ్ అభిమానులను గెలకడంతో కొందరు అభిమానులు ఏకంగా పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర అంటూ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లో కూడా తీశారు.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏకంగా “ఆర్జీవీ మిస్సింగ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రానికి దర్శకుడు అధిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా చటర్జీ నిర్మిస్తున్నాడు.అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లని విడుదల చేస్తూ తద్వారా ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి తెలియజేస్తున్నాడు.
అయితే ఈ చిత్రానికి ఆర్జీవీ మిస్సింగ్ అనే టైటిల్ తో పాటు రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ అయ్యాడని అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరియు మెగా ఫ్యామిలీ అలాగే మాజీ ముఖ్యమంత్రి మరియు అతడి కొడుకు కారణమంటూ పెట్టడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో చర్చనీయంశంగా మారింది. దీంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో రామ్ గోపాల్ వర్మ ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేగాక గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయ జీవిత చరిత్ర అంటూ పవర్ స్టార్ సినిమా తీసి రామ్ గోపాల్ వర్మ భారీగానే మూల్యం చెల్లించుకున్నాడు.