దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ హన్సిక మోత్వానీ.ఈ సినిమా తర్వాత ఈ భామ వరుస సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
తెలుగు, తమిళ బాషలలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.స్టార్ హీరోయిన్ రేంజ్ లో హవా సాగించింది.
అయితే ఆ చైర్ ని మాత్రం అందుకోలేకపోయింది.అల్లు అర్జున్, రవితేజ, రామ్, మంచి విష్ణు లాంటి హీరోలతో ఆడిపాడింది.
తెలుగులో అవకాశాలు తగ్గగానే తమిళంకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకుంది.అయితే మధ్యలో శింబుతో ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లి ఏవో కారణాల వలన ఆగిపోయింది.
అప్పటి నుంచి హాన్సిక కెరియర్ పూర్తిగా గాడితప్పింది.బొద్దుగా తయారు కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాకుండా పోయాయి.
దీంతో మరల స్లిమ్ అయ్యి ఒకప్పటి బ్యూటీని సొంతం చేసుకుంది.
చాలా గ్యాప్ తర్వాత మరల ఆ మధ్య గోపీచంద్ గౌతమ్ నందా సినిమాలో ఒక హీరోయిన్ గా చేసింది.
అయితే అందులో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది.తాజాగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ చిత్రంలో కథానాయికగా నటించింది.ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో మరల తెలుగు ప్రేక్షకులు ఆమెని మరిచిపోయారు.అయితే ఇప్పుడు ఊహించని విధంగా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా దూసుకొస్తున్న సత్యదేవ్ తో జత కట్టడానికి హన్సిక రెడీ అవుతుంది.
ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నాతో రొమాన్స్ చేయబోతున్నాడు.ఇప్పుడు హాన్సిక కూడా సత్యదేవ్ తో రొమాన్స్ చేయడానికి ఒకే చెప్పేసింది.
ఈ సినిమాకి సంబందించిన అన్ని వివరాలు త్వరలో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.