అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈయన వివాదానికి కేర్ అఫ్ అడ్రెస్స్.
ఇక చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ అగ్ర రాజ్యాన్ని వణికించడంతో పాటు ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా కరోనా వైరస్ వ్యాపించింది.దీంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ట్రంప్ కి సంబంధించిన ఓ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.
డోనాల్డ్ ట్రంప్ కు ములుగు సిద్ధాంతి దారుణమైన శాపం పెట్టాడని అందుకే డోనాల్డ్ ట్రంప్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే ములుగు సిద్ధాంతి డోనాల్డ్ ట్రంప్ ని ఇలా శపించారట.
అన్ని ఉన్న సరే ఎవరు లేకుండా చచ్చిపోతావ్.కుక్క చావు చస్తావు అంటూ ములుగు సిద్ధాంతి శాపం పెట్టాడు.
ఇక ఆ శాపంలనే కరోనా వైరస్ రావడంతో అతన్ని ఎవరు ముట్టుకోలేరు, పట్టుకోలేరు కాబట్టి ములుగు సిద్ధాంతి పెట్టిన శాపం ఫలించింది అంటూ కామెంట్ చేస్తున్నారు.దీంతో ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
కాగా డోనాల్డ్ ట్రంప్ కు ములుగు సిద్ధాంతి శాపం పెట్టడానికి కారణం గతంలో జాత్యాహంకార దాడుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ అనే సాఫ్ట్ వెర్ తో పాటు పలువురు భారతీయలు చనిపోయారని, ఇక ఆ సమయంలోనే కోపంలో ములుగు సిద్ధాంతి శాపం పెట్టినట్టు సమాచారం.అంతేకాదు డోనాల్డ్ ట్రంప్ కు కరోనా వైరస్ వచ్చిందని తెలియగానే అమెరికాలోని కొందరు డ్యాన్సులు వేయడం, పాటలు పడటం వంటివి చేయడంతో అవి వీడియోలుగా వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
దీన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది డోనాల్డ్ ట్రంప్ కి ఎంత నెగటివిటి ఉంది అనేది.