టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడిగా ఉన్న రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరో రెండు నెలల పాటు ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో లాక్ డౌన్ నుంచి మినహాయింపులు లభించడంతో షూటింగ్ సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే చాలా కాలంగా రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తా అని రాజమౌళి ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి ఆ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా జక్కన్న మహేష్ బాబు సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.
ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది.ఎలాంటి కథతో మహేష్ బాబుని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయబోతున్నాను అనే విషయంపై తాను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేనని, ఇప్పుడు ఆ విషయం తన చేతులలో లేదని తేల్చేశారు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా మీదనే ఉందని తేల్చేశాడు.ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్తో మహేష్ బాబు కోసం అద్భుతమైన స్టోరీ రెడీ చేయిస్తున్నట్టు స్పష్టం చేశారు.
అతను ఎలాంటి కథ రాస్తాడు అనేదాని మీద నేను మహేష్ ని ఎలా చూపిస్తాను అనే విషయం ఆధారపడి ఉందని తెలిపారు. సీనియర్ నిర్మాత కె.యల్.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి భారం మొత్తం తన తండ్రి మీద వేసేసి వదిలేసాడు.మరి సూపర్ స్టార్ కోసం విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి కథ ఇస్తాడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.