టాలీవుడ్లో ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.వరుసగా హిట్లు అందుకున్న రాజ్ తరుణ్ కథల ఎంపికలో తప్పటడుగులు వేయడంతో ఫ్లాప్లను మూటగట్టుకుంటున్నాడు.
ఇప్పటికే రాజ్ తరుణ్ కెరీర్ ఫేడవుట్ అవుతున్న క్రమంలో తాజాగా ఆయన నటించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నించాడు ఈ కుర్ర హీరో.
కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో పాటు రొటీన్ కథతో ప్రేక్షకులకు విసుగెత్తించాడు.దీంతో ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా ఓటీటీలో ఫ్లాప్గా నిలిచింది.ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్న రాజ్ తరుణ్ మరో ఫ్లాప్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.కాగా ఈ సినిమాను విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేసిన విధానం బాగున్నా, సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
ఇక వరుసగా మరో ఫ్లాప్ ఎదురవడంతో రాజ్ తరుణ్ కెరీర్ మరింత ఢీలా పడిందని చెప్పాలి.ఇప్పటికే ఆఫర్లు తక్కువగా ఉన్న ఈ హీరో, ఇప్పుడు మరో పరాభవంతో నెక్ట్స్ ఎలాంటి సినిమాల్లో నటిస్తాడా అని అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే హీరోగా వరుసగా ఫ్లాపులు వస్తుండటంతో, నెగెటివ్ పాత్రలు చేసేందుకు తాను రెడీ అంటూ దర్శకనిర్మాతలు ఓ హింట్ ఇచ్చాడు రాజ్ తరుణ్.అటు క్యారెక్టర్ పాత్రలు చేసేందుకు కూడా తాను రెడీ అంటూ చెప్పడంతో రాజ్ తరుణ్కు మున్ముందు ఎలాంటి పాత్రలు దక్కుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఒరేయ్ బుజ్జిగా చిత్రంలో రాజ్ తరుణ్ నటన పర్వాలేదనిపించినా, హీరోయిన్గా నటించిన మాళవికా నాయర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే హెబ్బా పటేల్ మాత్రం తన పాత్ర ఎంపికలో మరోసారి ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది.
మరి రాజ్ తరుణ్ కెరీర్ ఇకనుంచి ఎలా ఉండబోతుందో చూడాలి.