బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి ఆదివారం రోజు దేవి నాగవల్లి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.ఆమె ఎలిమినేషన్ బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది.
దేవి ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ ను ట్రోల్ చేశారు.మెహబూబ్, కుమార్ సాయిలకు దేవి కంటే తక్కువ ఓట్లు వచ్చినా ఆమెను ఎలిమినేట్ చేశారనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.
కొందరు ఆమె ఎలిమినేషన్ ను ఫేక్ ఎలిమినేషన్ అని భావించారు. అయితే ఆమె నిజంగా ఎలిమినేట్ అయిందని తెలిసిన తరువాత బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారనే కామెంట్లు వినిపించాయి.
బయటకు వచ్చిన తరువాత దేవి సైతం రీఎంట్రీ గురించి అనుమానాలను వ్యక్తం చేసింది.ప్రేక్షకులు సైతం దేవి ఎలిమినేషన్ ను జీర్ణించుకోలేకపోయారు.దేవిని మళ్లీ హౌస్ లో ప్రవేశపెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ నిర్వాహకులు దేవి నాగవల్లితో ఇప్పటికే రీఎంట్రీ గురించి సంప్రదింపులు జరుపుతున్నారని.
దేవి హౌస్ లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ నిర్ధారణ అయితే త్వరలోనే హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే దేవి ఇంటర్వ్యూలో బిగ్ బాస్ నిర్వాహకులు కోరితే రీఎంట్రీకి సిద్ధమని తెలిపిన సంగతి తెలిసిందే.
త్వరలో దేవి రీఎంట్రీ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
దేవికి ఎలిమినేషన్ తర్వాత భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన నేపథ్యంలో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని బిగ్ బాస్ టీం భావిస్తోంది.దేవి రీఎంట్రీ ద్వారా ఎలిమినేషన్ విషయంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని బిగ్ బాస్ టీం అనుకుంటోంది.
మరి నిజంగా దేవి రీఎంట్రీ ఇవ్వనుందో లేదో అధికారికంగా తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.