సుశాంత్ మృతి కేసు విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ ఛాటింగ్ బయట పడింది.రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడికి డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది.
ఇప్పటికే వారిద్దరు కూడా జైల్లో ఉన్నారు.వారిని విచారిస్తున్న సమయంలో మరింత మంది పేర్లు బయటకు వస్తున్నాయి.
రియాతో డ్రగ్స్ చాట్ చేసినట్లుగా అనుమానంతో రకుల్ ప్రీత్ సింగ్, దీపిక పదుకునే, శ్రద్దా కపూర్ మరియు సారా అలీ ఖాన్ లను ఎన్ సీ బీ అధికారులు విచారించిన విషయం తెల్సిందే.వారిని మళ్లీ విచారణకు పిలవక పోవడంతో వారు ఇచ్చిన సమాచారంకు ఎన్ సీబీ అధికారులు సంతృప్తి చెంది ఉంటారని అందుకే వారిని అరెస్ట్ చేయడం కాని మళ్లీ విచారణకు పిలవలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఎన్ సీ బీ అధికారులు డ్రగ్స్ కేసులో కొత్తగా ఎవరిని విచారించే అవకాశం లేదని తెలుస్తోంది.ఎందుకంటే వారిని కొత్తగా విచారించేందుకు ఏమీ లేదని అంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంట్లో రియా కోరిక మేరకు డ్రగ్స్ ను దాచినట్లుగా ఒప్పుకుందట.అయితే రియా ఒత్తిడి మేరకు ఆ పని చేసినట్లుగా ఆమె పేర్కొంది.
అందులో ఆమె ఏ తప్పు లేదని విచారణ అధికారులు భావిస్తున్నారట.ఈ విషయమై ఆమెకు క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు విచారణ ఎదుర్కొన్న ఇతర హీరోయిన్స్ దీపిక పదుకునే మరియు సారా అలీ ఖాన్ లు సైతం ఎన్ సీ బీ నుండి క్లీన్ చీట్ దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే కొత్తగా వారిని విచారించే అవకాశం లేదని అనిపిస్తుంది.
మరి ఎన్ సీ బీ అధికారుల తదుపరి రియాక్షన్ ఏంటో చూడాలి.ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు ఎన్ సీ బీ అధికారులు వెళ్లడించారట.