సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.
లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.మరల షూటింగ్ లకి అనుమతి లభించడంతో షెడ్యూల్ ప్లాన్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది.
ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, మీనా, కుష్బూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ రజినీకాంత్ కి ప్రతినాయకుడుగా కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత తన కలానికి పదును పెట్టబోతున్నారు.
గతంలో బాబా సినిమా కోసం రజినీకాంత్ స్క్రీన్ ప్లే రైటర్ గా మారారు.అయితే ఆ సినిమా రజినీకాంత్ కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మారడంతో సూపర్ స్టార్ టాలెంట్ ఎవరికీ తెలియకుండా పోయింది.
అయితే ఇప్పుడు అన్నాత్తై సినిమా కోసం రజినీకాంత్ కలానికి పని చెబుతూ డైలాగ్స్ రాయబోతున్నారని టాక్ నడుస్తుంది.విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాకు సూపర్స్టార్ డైలాగ్స్ రాస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో పదునైన సంభాషణలు రజినీకాంత్ అందించబోతున్నారని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
ఇక రజినీకాంత్ డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి బాబా సినిమాతో రజినీకాంత్ కి రచయితగా రాని గుర్తింపు ఈ సినిమాతో అయినా వస్తుందేమో చూడాలి.