సెలబ్రెటీలకి ఫేమ్ ఉన్నంత వరకు వారిని ఫాలో అయ్యేవారు, అభిమానించే వారు విపరీతంగా ఉంటారు.అలాగే ఇండస్ట్రీలో కూడా అలాంటి సెలబ్రెటీలని అవకాశం దొరికిన ప్రతిసారి ఆకాశానికి ఎత్తేయడం చేస్తూ ఉంటారు.
అయితే ఒక్కసారిగా ఫేమ్ కోల్పోతే అలాంటి వారిని సినిమా ఇండస్ట్రీలో ఎవరూ పెద్దగా పట్టించుకోరు.ఇండస్ట్రీలో కేవలం ఫేమ్ ఒకటే పదిమందిలో గౌరవం లభించేలా చేస్తుంది.
ఫేమ్ లేని వాళ్ళు అంతకు ముందు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎన్ని గొప్ప సినిమాలు చేసినా కూడా వాటిని అస్సలు గుర్తించరు.ఇక ఫేమ్ కోల్పోయిన సెలబ్రెటీలు కూడా ఇండస్ట్రీతో సంబంధాలు వదులుకొని సాధారణ జీవితం గడపడానికి ఆసక్తి చూపిస్తారు.
ఎంత గొప్ప స్టార్స్ అయిన చివరి రోజులలో కనీసం ఇండస్ట్రీలో సెలబ్రెటీల చూపుకి కూడా నోచుకోరు.గతంలో సావిత్రి, ఘంటశాల, జగ్గయ్య, రాజనాల, కమెడియన్ పద్మనాభం, రాజబాబు లాంటి వారు అత్యంత దీనమైన స్థితిలో చనిపోయారు.
వారు చనిపోయే సమయంలో ఇండస్ట్రీలో సెలబ్రెటీలు కూడా కనీసం కడచూపుకి కూడా వెళ్లకుండా అవమానకార రీతిలో వ్యవహరించారు.
ఇప్పుడు ఎస్పీ బాలు విషయంలో కూడా తెలుగు చిత్రపరిశ్రమ అదే రీతిలో వ్యవహరించింది అనే మాట సోషల్ మీడియాలో వినిపించింది.
దిగ్గజ గాయకుడుగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అతను చనిపోయిన తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా చూడటానికి వెళ్ళలేదు.దీనికి వారు ఎన్ని కారణాలు చెప్పిన, తమిళనాడులో చాలా మంది ఎస్పీ బాలు భౌతిక కాయం చూడటానికి వెళ్లారు.
ఒక తెలుగు వాడు అయినా బాలుని చూడటానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా వెళ్లి నివాళి అర్పించే ప్రయత్నం చేయలేదు.సోషల్ మీడియాలో సెలబ్రెటీలు అందరూ ఆవేదనతో వ్యక్తం చేస్తూ వీడియోలు చేసిన కడచూపుకి మాత్రం వెళ్లే ప్రయత్నం చేయలేదు.
చిత్ర పరిశ్రమ నుంచి ఆయనకి సరైన గౌరవం లభించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రెటీలు అందరూ స్వార్ధపూరితంగా తయారయ్యారని, ఎస్పీ బాలుని తీవ్రంగా అవమానించారని విమర్శలు చేస్తున్నారు.
కరోనా సమయంలో వారి అవసరాల కోసం ముఖ్యమంత్రులకి కలవడానికి వెళ్లిన వారికి ఎస్పీ బాలుని చూడటానికి వెళ్లడం కష్టం అయిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.