తెలుగులో ప్రముఖ దర్శకుడు జీ.రవి చంద్రారెడ్డి దర్శకత్వం వహించిన “కాళిదాసు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమైన అక్కినేని వారి కుర్రాడు హీరో సుశాంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే సుశాంత్ కాళిదాసు, కరెంటు, అడ్డా తదితర చిత్రాలతో మొదట్లో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో వెను వెంటనే బాక్సాఫీసు వద్ద దొంగాట, ఆటాడుకుందాం రా, తదితర చిత్రాలతో ప్లాప్ లను మూటగట్టుకున్నాడు. కానీ ఈ ఏడాదిలో విడుదలైన టువంటి అల వైకుంఠ పురంలో అనే చిత్రం ద్వారా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.
అయితే తాజాగా హీరో అక్కినేని సుశాంత్ తన కుటుంబ సభ్యులతో కాలేజీలో చదివే సమయంలో కలిసి దిగినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ ఫోటోలో అతడి తల్లిదండ్రులు సత్య భూషన్ రావు మరియు నాగ సుశీల అక్కినేని, అలాగే అమ్మమ్మ తాతయ్య లు అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఒకప్పటి సుశాంత్ ఫోటోని చూస్తే ఇప్పుడు గుర్తు పట్టడం నిజంగానే కష్టమేమో అనిపిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో లో సుశాంత్ “ఇచ్చట వాహనములు నిలపరాదు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ పనులను నిలిపివేయగా ఇటీవలే మొదలు పెట్టినట్లు తాజాగా హీరో సుశాంత్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు.