డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం నడుస్తుంది.కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్ లు ఓపెన్ కాకపోవడం కూడా ఒటీటీ చానల్స్ కి భాగా కలిసొస్తుంది.
దీంతో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ అయిన సినిమాపై దృష్టి పెట్టాయి.ఆ సినిమా రేంజ్, కాంబినేషన్, హీరో మార్కెట్ అంశాలని పరిగణలోకి తీసుకొని తమకి ఎంత అయితే వర్క్ అవుట్ అవుతుంది అనేది చూసుకొని ఒటీటీ చానల్స్ సదరు సినిమా నిర్మాతలకి ఆఫర్ చేస్తున్నారు.
చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా పెట్టిన పెట్టుబడికి కొంత లాభం, లేదంటే రెట్టింపు సొమ్ము చెల్లించి డిజిటల్ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి.ఇక ప్రస్తుత పరిస్థితులు సినిమా రిలీజ్ ఆపడం కంటే వచ్చిన లాభం సరిపెట్టుకొని డిజిటల్ లో రిలీజ్ చేయడమే ఉత్తమం అని భావిస్తున్న నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే హిందీలో పెద్ద పెద్ద సినిమాలు ఒటీటీలో రిలీజ్ అయ్యాయి.ఇక తెలుగులో కూడా వి సినిమాతో పాటు కొన్ని చిన్న సినిమాలు ఒటీటీలోకి వెళ్ళిపోయాయి.
ఇదిలా ఉంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో మొదటి సారి పెద్ద మొత్తంలో రిలీజ్ రైట్స్ దక్కించుకున్న సినిమా లక్ష్మి బాంబ్.అక్షయ్ కుమార్ హీరోగా, లారెన్స్ దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి డిస్నీ హాట్ స్టార్ ఏకంగా 125 కోట్లు చెల్లించింది.
ఈ నేపధ్యంలో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ లో సినిమా ప్రోమో తో కన్ఫర్మ్ చేసింది.నవంబర్ 9న డిస్నీ హాట్స్టార్లో ఈ చిత్రం అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించింది.
ఈ దీపావళిని మీ ఇంట్లో లక్ష్మీ బాంబ్ తో జరుపుకోండని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.ప్రోమోలో అక్షయ్ లుక్కు నెటిజన్ల ప్రశంసలు లభిస్తున్నాయి.ఇక ఈ సినిమా తమిళ, తెలుగు బాషలలో సూపర్ హిట్ అయిన కాంచనకి రీమేక్ గా తెరకెక్కింది.