తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం మరో ఘనతను సాధించింది.తాజాగా ఓ ప్రైవేట్ కంపెనీ జరిపిన సర్వే ఫలితాలను దేశంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ నిలిచింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే… హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ ఓ సర్వేను నిర్వహించింది.
భారతదేశంలోని అన్ని నగరాలలో కంటే పని చేసుకోవడానికి అనువైన ప్రదేశం, అలాగే నివాసయోగ్యమైన ప్రాంతానికి సంబంధించి సర్వే నిర్వహించింది.
ఇందులో భాగంగానే సదరు కంపెనీ భారతదేశంలోని 34 పట్టణాలలో సర్వే నిర్వహించింది.
ఈ సర్వే ఫలితాల ప్రకారం బెంగళూర్, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ లాంటి నగరాలను దాటి హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.అంతే కాదు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా హైదరాబాదు నగరాన్ని పర్యటించడానికి సెప్టెంబర్ నెల నుండి మార్చి నెల మధ్య కాలం ఎంతో అనువైన కాలమని పేర్కొంది.
దీంతో పాటు హైదరాబాద్ మహానగరం దక్షిణ భారతదేశం న్యూయార్క్ నగరంగా మారుతోందని ఆ సంస్థ ప్రశంసలు కురిపించింది.
ఇందుకు సంబంధించి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ పూర్వకంగా తెలిపాడు.
ఈ ట్వీట్ లో హైదరాబాద్ నగరం మరోసారి అరుదైన ఘనత సాధించిందని… ఇప్పటికే అనేక జాతీయ సర్వేలలో ప్రపంచ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ మహానగరం ఉత్తమంగా నిలుస్తోందని తాజాగా మరోసారి దేశంలోనే బెస్ట్ సిటీగా నిలిచింది అంటూ ట్వీట్ చేసాడు.ఇక ఈ ట్వీట్ ను తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా రీ ట్వీట్ చేస్తూ మేకపాటి గౌతమ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.