పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన పవన్, ఆ తరువాత గబ్బర్సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ఓకే చేశాడు.
కాగా క్రిష్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.రాబిన్హుడ్ తరహా కథతో క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తాడని తెలుస్తుంది.కాగా ఈ సినిమాకు తొలుత ‘బందిపోటు’, ‘గజదొంగ’ వంటి టైటిల్ పెడతారని అందరూ అనుకున్నారు.
కానీ ఆ తరువాత ‘విరూపాక్ష’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఓకే చేసిందంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ సినిమాకు మరో టైటిల్ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ‘శివం’ అనే టైటిల్ను పెట్టేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ఈ సినిమా కథకు ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించి, వీలైనంత త్వరగా ఈ సినిమాను ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇటీవల పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
మరి ఈ సినిమాకు ఏ టైటిల్ను చిత్ర యూనిట్ ఫైనల్ చేస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.