ఎప్పుడు మోడలింగ్ ఫోటో షూట్ లు, సినిమా షూటింగ్ లు అంటూ బిజీగా ఉండే సెలబ్రిటీలకి ఖాళీగా ఉండటం అంటే చాలా కష్టం.ఈ ఖాళీ సమయం నెలలో ఒక పది రోజులు అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు.
అయితే ఏకంగా ఆరు నెలలు ఖాళీ టైం అంటే కచ్చితంగా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది.ఇప్పుడు హీరోయిన్స్ కి కూడా అలాగే ఈ లాక్ డౌన్ టైం చాలా బోరింగ్ గా మారిపోయింది.
కొన్ని రోజులు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసిన కూడా షూటింగ్ లు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా, మళ్ళీ మనం ఎప్పుడు మేకప్ వేసుకుంటామా అని ఆత్రుతగా ఎదురుచూశారు.ఆ ఎదురుచూపులు ఫలించడంతో ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కాస్తా ఉత్సాహంగా ఉన్నారు.
షూటింగ్ స్టార్ట్ అవుతున్నాయి.మళ్ళీ బిజీ అవ్వబోతున్నాం అంటూ సంబరపడిపోయి ఆ విషయాలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇప్పటికే కీర్తి సురేష్, రష్మిక మందన లాంటి అందాల భామలు షూటింగ్ గురించి ఆసక్తిగా షేర్ చేసుకున్నారు.ఇప్పుడు పూజా హెగ్డే కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది.
దీనికి కారణం చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగులో జాయిన్ అవుతున్నందుకే.ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగులో జాయిన్ అవడానికి ఈ అమ్మడు హైదరాబాదు చేరుకుంది.
కొన్ని రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె ఇక్కడే వుంటుంది.దీంతో అనుకున్నట్లే రాధే శ్యామ్ షూటింగ్ ఖరారైంది అని తెలుస్తుంది.
మొత్తానికి పూజా పాప తన అత్యుత్సాహంతో తెలియకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అనే విషయాన్ని రివీల్ చేసేసింది.పూజాహెగ్డే రాక బట్టి ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని అర్ధమవుతుంది.