డిజాస్టర్ దర్శకుడుగా టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న వ్యక్తి మెహర్ రమేష్.చేసినవి మూడు సినిమాలే అయిన అందులో రెండు సినిమాలు ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యాయి.బిల్లా సినిమా ఏదో ఎవరేజ్ తో బయటపడింది.తెరపై భారీతనం కోసం నిర్మాతతో విపరీతంగా ఖర్చు పెట్టించే మెహర్ రమేష్ కి ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మోక్షం వచ్చింది.
ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.కొత్త టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న మెగాస్టార్ పనిలో పనిగా తనని నమ్ముకొని ఉన్న మెహర్ రమేష్ కి కూడా గొప్ప అవకాశం ఇచ్చారు.
తమిళంలో అజిత్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన వేదాలం రీమేక్ బాధ్యతలు అతని చేతిలో పెట్టాడు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర వరుస ప్రాజెక్ట్ లని సెట్స్ పైకి ఎక్కిస్తున్నాడు.అవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.
అందులో భాగంగానే ఇప్పుడు మెగాస్టార్ వేదాలం రీమేక్ నిర్మించే అవకాశం అనిల్ సుంకరకి వచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో కేవలం మెగాస్టార్ ని నమ్మి నిర్మాత ఏకంగా 80 కోట్లు బడ్జెట్ పెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే వంద కోట్ల బిజినెస్ రిలీజ్ కి ముందే జరిగిపోతుంది.ఈ నమ్మకంతోనే మెహర్ రమేష్ దర్శకత్వం అయిన కూడా నిర్మాత ధైర్యం చేసి చిరంజీవిని నమ్ముకొని అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం.
మరి నిర్మాత, మెగాస్టార్ పెట్టుకున్న నమ్మకాన్ని మెహర్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడు అనేది చూడాలి.