టాలీవుడ్ లో అనేకమంది టాప్ హీరోలకి సినిమాలలో లైఫ్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
అయితే కొన్ని రోజుల ముందు నుండి పూరిజగన్నాథ్ తన ఇంట్లోనే ఉంటూ పోడ్ కాస్ట్ రూపంలో అనేక విషయాలపై తన అభిప్రాయాలను తెలియచేస్తున్నాడు.ఇప్పటికే ఆయన ఈ విధానం ద్వారా అనేక విషయాలపై కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా మాటలు మాట్లాడారు.
ఇక తాజాగా ఆయన డబ్బు గురించి మాట్లాడుతూ… జీవితంలో ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా అవసరం అని, ప్రస్తుతం డబ్బు లేకుంటే ఎవరు పలకరించడానికి కూడా ఇష్టపడరని కుండబద్దలు అయ్యేలా ఆయన మాట్లాడారు.చివరికి డబ్బు లేని దేవుడిని కూడా మనుషులు గౌరవించరని ఆయన తాజాగా తెలిపాడు.
అడవిలో బతికే వారికీ ఎలాంటి డబ్బు అవసరం పడదని, అలాంటి వారే ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపాడు.అయితే, ఇక సమాజంలో బ్రతకాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు అవసరం అని… అందుకోసం మనిషి ఎన్నో రకాల అడ్డదారులను తొక్కవలిసి వస్తుందని ఆయన మాట్లాడారు.
ఇక ఇది వరకు పూరి జగన్నాథ్ అనేక అంశాలపై మాట్లాడిన సంగతి విదితమే.ఇదివరకు ఆయన రిజర్వేషన్స్ గురించి, దేశంలో పేదల గురించి అనేక అంశాలపై కామెంట్ చేశారు.
ఇందులో ముఖ్యంగా పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదని అలాగే రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు పేదలకు, చదువు రాని వారికి అసలు వారు నాయకులను ఎన్నుకోవడానికి వారు పనికిరారని అలాంటి వారికి ఓటు హక్కు తీసివేయాలని తేల్చిచెప్పాడు.
ఇందులో కొన్ని వ్యాఖ్యలపై పూరి జగన్నాథ్ పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కలిసి ఫైటర్ అనే సినిమాను పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కించబోతున్నారు.