ఏంటి నిజామా? అలా ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఆశ్చర్యపోయే ఘటనలే జరుగుతున్నాయి.అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు.ఎందుకంటే? ఇటీవల కాలంలో ఎక్కడ లేని వింతలు అన్ని జరుగుతున్నాయ్.ఆ వింతలు కాస్త ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇంకేముంది అవి ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయ్.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా కప్ప పొట్టలో మెరుపులు వచ్చే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఎందుకు అని ఆశ్చర్యం కలుగుతుంది.కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.
ఎక్కడ జరిగింది? అలా ఎందుకు అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్న.మిణుగురు పురుగులు గురించి తెలిసిందే కదా.ఆ పురుగులు అలా అలా మెరుస్తూ ఉంటాయి.
అలా మెరిసే మిణుగురు పురుగును ఈ కప్ప ఏమైనా మింగిందా? అందుకే ఇలా మెరుస్తుందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.అయితే మిణుగురు పురుగును మింగితే వెంటనే అది చచ్చిపోతుంది మరి ఎందుకు మెరుస్తుంది అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే మిణుగురు పురుగులనే ఇది కప్పన అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కప్ప ఏ జాతికి చెందినదో ఎవరికి తెలియదు కానీ నెట్టింట్లో మాత్రం తెగ హాల్ చల్ చేస్తుంది.ఈ కప్ప ఎక్కడ ఉంది ? ఎందుకు అలా మెరుస్తుంది అనేది ఎవరికి తెలియదు కానీ జోకులు మాత్రం భారీగా వేస్తున్నారు.14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను నేచర్ ఈజ్ లిట్ అనే ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.
.