తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా 65 శాతం చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సినీ వర్గాల సమాచారం.తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి గుండు లుక్ లో దర్శనమివ్వడంతో ఈ ఫోటో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ గుండు లుక్ గురించి ప్రముఖ పీఆర్వో వంశీ శేఖర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవి నటించబోయే ఓ చిత్రంలో ట్రయల్ లుక్ లో భాగంగా గుండు చేయించుకున్నారని తెలిపాడు.
దీంతో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గురించి తెలియడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అలాగే కొంత మంది మెగా అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి తమిళంలో మంచి విజయం సాధించిన టువంటి “వేదాళం” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడని అందులో భాగంగానే గుండు చేయించుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా గుండు బాస్ న్యూ లుక్ అదిరిందని తెగ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క ఆచార్య చిత్రంలో నటిస్తూనే మలయాళంలో మంచి విజయం సాధించిన “లూసిఫర్” చిత్రాన్ని తెలుగులో అనువాదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అంతేగాక ఈ చిత్ర రీమేక్ బాధ్యతలను తెలుగు లో పలు భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన యంగ్ దర్శకుడు సుజిత్ కి అప్పగించినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.