అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.కరోనా కారణంగా ఈ ఎన్నికలు వాయిదా వేయాలని అనుకున్న ట్రంప్ ప్లాన్ పారలేదు.
దాంతో ఎన్నికల్లో గెలుపుకోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.తనపై ఇప్పటి వరకూ పడ్డ మచ్చలన్నిటినీ ఎన్నికల్లోగా ఒక్కొక్కటిగా తొలగించుకోవాలని ఎత్తులు వేస్తున్న ట్రంప్.
తానొక శాంతి దూతగా ప్రకటించుకునే ప్రయత్నం చేస్తున్నారు.అందుకు నిదర్శనం తాజాగా నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదనకి రావడమే.
ఇదిలాఉంటే.
నోబెల్ బహుమతి ట్రంప్ కి ఇవ్వాలంటూ గతంలోనే ట్రంప్ పేరు ప్రతిపాదనకి వచ్చింది.
స్వయంగా ట్రంప్ సైతం తనకి నోబెల్ ఇస్తే తప్పేంటి అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించడం కూడా సంచలనం సృష్టించింది.అయితే అప్పట్లో డెమోక్రటిక్ పార్టీ నోబెల్ కి శాంతి బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదనపై చాలా ఘాటుగానే స్పందించింది.
ఇరాక్ పై ట్రంప్ చూపిస్తున్న వైఖరికి ఎలాంటి బహుమతులు రావని ఎద్దేవా చేసింది…ఈ క్రమంలోనే
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి నోబెల్ శాంతి బహుమతి – 2021 కి గాను నామినేట్ అయ్యారు.ఇజ్రాయిల్ , యూఏఈ ల మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ జడ్డే ట్రంప్ పేరుని ప్రతిపాదించారు.
ఇరు దేశాల మధ్య ట్రంప్ సామరస్యం వెలసిల్లెలా చేశారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించారని , అమెరికా బలగాలు మొహరించి ఉన్న పలు దేశలలో బలాలు వెనక్కి వేచ్చేలా ట్రంప్ చొరవ చూపారని అన్నారు.ట్రంప్ పేరుని జడ్డే నోబెల్ కి ప్రతిపాదించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.