నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే.
కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబోలో రాబోయే సినిమాతో అదిరిపోయే హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నారు.
ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్టైనర్గా బోయపాటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం థమన్ మరోసారి అదిరిపోయే సంగీతాన్ని అందించినట్లు తెలుస్తోంది.ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రానికి కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించిన థమన్, ఈసారి బాలయ్యకు కూడా అదే రేంజ్లో మ్యూజిక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
బాలయ్య కోసం అదిరిపోయే రేంజ్లో మ్యూజిక్ను అందిస్తున్నట్లు, నందమూరి ఫ్యాన్స్కు ఈ సినిమాలోని పాటలు ఖచ్చితంగా నచ్చుతాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
కాగా ఈ సినిమాలో రైతు పాత్రలో బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందో మనకు టీజర్ రూపంలో ఇప్పటికే తెలిపారు.కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా, సీనియర్ బ్యూటీ మీనా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరి ఈ సినిమాలో బాలయ్య కోసం థమన్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తున్నాడో చూడాలి.