బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.నార్కోటిక్స్ పోలీసులు నిన్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు.
సుశాంత్ మృతి అనంతరం వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ దందా వల్ల రియాను అరెస్ట్ చేశారు.ఎన్డీపీఎస్లో వివిధ సెక్షన్ల కింద రియాపై కేసులను నమోదు చేశారు.
ఎన్సీబీ అధికారుల విచారణలో రియా డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించింది.దీంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే తాజాగా రియా తండ్రి ఇంద్రజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.విచారణకు సహకరించినప్పటికీ తన కూతురును అరెస్ట్ చేయడం సరికాదని ఆయన అన్నారు.ప్రపంచంలో ఏ తండ్రి కూతురును అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేడని తెలిపారు.రియా చక్రవర్తిని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో బెయిల్ కోసం ప్రయత్నించానని….
అయితే బెయిల్ మంజూరు కాలేదని చెప్పుకొచ్చారు.
జరుగుతున్న పరిణామాల వల్ల తనకు చచ్చిపోవాలని ఉందని ఆయన అన్నారు.
సుశాంత్ కు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని… అయితే అతని మృతికి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని….సుశాంత్ జీవించి ఉంటే డ్రగ్స్ దందాలో అతనే ప్రథమ ముద్దాయి అయి ఉండేవాడని ఆయన పేర్కొన్నారు.
దేశం మొత్తం ఎటువంటి ఆధారాలు లేకుండా తన కూతురిని జైలుకు పంపిందని అన్నారు.
సోషల్ మీడియా ద్వారా ఇంద్రజిత్ చక్రవర్తి ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
నార్కోటిక్స్ అధికారులు కొన్ని రోజుల క్రితమే సుశాంత్ మేనేజర్ శామ్యూల్ ను, రియా సోదరుడు శౌవిక్ ను అరెస్ట్ చేశారు.వరుస అరెస్ట్ లతో సుశాంత్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
ఈ కేసులో అధికారులు మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.