అప్పుడెప్పుడో 2005లో వచ్చిన సూపర్ సినిమతో వెండితెరకు పరిచయం అయ్యింది స్వీటీబ్యూటీ అనుష్క.అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్లు అవుతున్నా కూడా అనుష్క క్రేజ్ ఎంత మత్రం తగ్గలేదు.
మూడున్నర పదుల వయస్సు దాటేసి నాలుగు పదులకు చేరువ అవుతోన్న ఈ బొద్దుగుమ్మ ఇటీవలే కాస్త ఒళ్లు చేసింది.ఓ హీరోయిన్గా 15 ఏళ్ల పాటు ఒక్క ఇండస్ట్రీలో కాదు నాలుగైదు భాషల్లో టాప్ హీరోయిన్గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు.
ఆ ఘనత నయనతార తర్వాత ఒక్క అనుష్కకే దక్కింది.
ఇక సౌత్లో అన్ని భాషల్లో వరుసగా స్టార్ హీరోలతో క్రేజీ ఛాన్సులే దక్కించుకున్న ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బాహుబలి 1,2 సినిమాల తర్వాత అనుష్క పేరు సౌత్లోనే కాదు నార్త్లో కూడా మార్మోగిపోయింది.ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఆమె హంగామా మాత్రం చాలా తక్కువ ఉంటుంది.
అయినా కూడా అనుష్క సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.ఆమె ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ స్విటీ బ్యూటీ ఫేస్బుక్ పేజ్లో ఆమెను అనుసరించే వారి సంఖ్య ఏకంగా 23 మిలియన్లు దాటేసింది.ఇక ఆమె ఫేస్బుక్ పేజ్ ఏకంగా 14 + మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది.ఈ విషయంలో ప్రభాస్ను సైతం ఆమె బీట్ చేసేసింది.వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎనౌన్స్ చేస్తూ బాలీవుడ్ స్టార్స్కే దిమ్మతిరిగే షాక్ ఇస్తోన్న ప్రభాస్ ఫేస్బుక్ పేజ్కు 19 మిలియన్ల ఫాలోవర్స్, అక్కినేని సమంతకు 17 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక లైక్స్ విషయంలో అల్లు అర్జున్ 13 మిలియన్స్, ప్రభాస్ 10 మిలియన్స్, సమంత 9 మిలియన్స్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.ఇక అనుష్కకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఏకంగా 3.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.ఆమె ట్విట్టర్లోకి మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.
ఇటీవల ఓ అభిమాని ఆమెను మీరు ట్విట్టర్లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ… టైం వచ్చినప్పుడు ట్విట్టర్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పింది.