టాలీవుడ్ లో బడా నిర్మాతలలో ఒకరుగా సురేష్ బాబు తన హవా కొనసాగిస్తున్నారు.తండ్రి వారసత్వంతో నిర్మాతగా, థియేటర్ల యాజమానిగా వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఇక నిర్మాతగా ఆ మధ్య పూర్తిగా సినిమాలు తగ్గించేసిన సురేష్ బాబు చిన్న చిత్రాలని కొనేసి రిలీజ్ చేసి బాగానే క్యాష్ చేసుకున్నారు.తరువాత మరల ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటూ నిర్మాతగా తక్కువ బడ్జెట్ చిత్రాలు ఓ వైపు, భారీ బడ్జెట్ చిత్రాలు మరో వైపు ప్లాన్ చేస్తున్నారు.
ఎక్కువగా స్ట్రైట్ కథల కంటే ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలని తెలుగులో రీమేక్ చేసి హిట్స్ కొట్టడానికి సురేష్ బాబు ప్రాధాన్యత ఇస్తున్నాడని, అతను నిర్మిస్తున్న సినిమాలు చూస్తే అర్ధమవుతుంది.కొరియన్ సినిమాని సమంతతో ఓ బేబీ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
సమంత కెరియర్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ఆ సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న నారప్ప సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి రీమేక్ అనే విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే సురేష్ బాబు ఇప్పుడు మరో రెండు కొరియన్ మూవీల రైట్స్ ని సొంతం చేసుకొని రీమేక్ కి సిద్ధం చేస్తున్నాడు.మిడ్ నైట్ రన్నర్స్, డ్యాన్సింగ్ క్వీన్ సినిమాల రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు.
మిడ్నైట్ రన్నర్స్ ను సుధీర్ వర్మ డైరక్షన్ లో రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో నివేదా థామస్, రెజినా నటిస్తారని సమాచారం.ఇక డ్యాన్సింగ్ క్వీన్ రీమేక్ లో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.డ్యాన్సింగ్ క్వీన్ సినిమాకు యాక్షన్ సినిమాల డైరక్టర్ శ్రీవాస్ ను డైరక్టర్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కోసం సమంతని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.