బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణంతో డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.డ్రగ్స్ విషయంలో కేవలం బాలీవుడ్ ఏ కాదు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ అన్ని సైట్స్ నుంచి షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి.
మొన్నటికి మొన్న టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత సైతం టాలీవుడ్ లో పార్టీలు డ్రగ్స్ లేకుండా జరగవు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లో రియా చక్రవర్తిని డ్రగ్స్ విషయం విచారిస్తుండగా కన్నడలో రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేసి ఆమె నుంచి సంచలన విషయాలను రాబడుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే రాగిణి ద్వివేదికి మద్దతు ఇస్తూ కన్నడ హాట్ బ్యూటీ నివేదిత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గంజాయి ని మన భారత దేశంలో చట్ట బద్దం చెయ్యాలని, గంజాయి తులసి మొక్కలాంటిదే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి ని బ్యాన్ చేయకముందు ఎన్నో ఆయుర్వేద ఔషదాలలు ఉపయోగపదేదని ఆమె చెప్పుకొచ్చారు.
దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయ్.
పవిత్రమైన తులసి ముక్కను గంజాయితో ఎలా పోలుస్తుంది అంటూ నెట్టింట్లో కొందరు అందులోనే వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో డ్రగ్స్ విషయంపై రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.