దేశ వ్యాప్తంగా రోజు రోజుకి వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతూ పరిస్థితి ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోతుంది.అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా కష్టాలని ప్రజలకే వదిలేసి మీ చావు మీరు చావండి కరోనా వచ్చినా మీరే ట్రీట్మెంట్ చేసుకొండి మేము దానికి బాధ్యులం కాదు అని లాక్ డౌన్ ఆంక్షలు చాలా వరకు ఎత్తేసింది.
ఇక సినిమా షూటింగ్ లకి కూడా యధావిధిగా పర్మిషన్ ఇచ్చేసింది.దీంతో ప్రజలు విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చి తిరిగేస్తున్నారు.
ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోతున్నారు.ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కరోనా విషయంలో కాస్తా నిర్లక్ష్యంగానే ఉన్నారని చెప్పాలి.
ఈ నేపధ్యంలో కరోనా బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది.ఇదిలా ఉండగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా బారిన పడేవారి జాబితా ఇంకా కొనసాగుతుంది.
బాలీవుడ్ యువ హీరో బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ తాజాగా కరోనా బారిన పడ్డాడు.ఈ విషయాన్ని అతనే ఇంస్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేశాడు.
నాకు కరోనా సోకింది.నా బాధ్యతగా ఈ విషయాన్ని అందరికీ చెబుతున్నాను.
నేను బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి లక్షణాల్లేవు.వైద్యుల సూచన మేరకు నేను హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను.
ప్రస్తుతం ఊహించలేని విధంగా కాలం మారిపోయింది.అందరం గడ్డు పరిస్థితిలో ఉన్నాం.
ఈ వైరస్ నుంచి మనమంతా బయటపడతామనే నమ్మకం నాకు ఉంది.తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లు తలెత్తకుండా ఉండేందుకు రాబోయే రోజుల్లో ఇకపై తన ఆరోగ్య పరిస్థితిపై తానే అప్ డేట్స్ ఇస్తానని కూడా అర్జున్ కపూర్ స్పష్టంచేశాడు.
అర్జున్ కపూర్ తో పాటు అతని ముదురు ప్రియురాలు మలైకా అరోరా కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.
.