నేచురల్ స్టార్ నాని – సుధీర్బాబు జంటగా తెరకెక్కిన సినిమా వి.సస్పెన్స్ క్రైం థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్, అదిథి రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు.
దిల్ రాజు నిర్మాణంగా మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25నే థియేటర్లలోకి రావాల్సి ఉంది.అయితే కరోనా కారణంగా సుదీర్ఘకాలంగా థియేటర్లు వాయిదా పడడంతో ఎట్టకేలకు ఈ రోజు అమోజాన్ డిజిటల్ స్ట్రీమింగ్లో రిలీజ్ అయ్యింది.
సినిమాకు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది.కథ, కథనాలు గాడి తప్పాయని… నాని నటన బాగున్నా, దర్శకుడు మోహన్కృష్ణ తన సినిమాలన్నింటిలోనూ ఓ వీక్ సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాకు నెగిటివ్ టాక్ అలా వచ్చిందో లేదో టాలీవుడ్లోని మరో యంగ్ హీరో ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు షురూ చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో వీ సినిమా పనైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.
వీ సినిమా పరమ బోరింగ్ సినిమా అంటూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు.నెగిటివ్ రివ్యూలను కూడా బాగా షేర్ చేస్తున్నారు.
నాని సదరు యంగ్ హీరో వరుస హిట్లతో తనకు పోటీ వస్తుండడంతో మరో యంగ్ హీరోను తెరమీదకు తీసుకు రావడంతో పాటు అతడి సినిమాలను ప్రమోట్ చేయడం.అతడితో సినిమాలు నిర్మించడం చేస్తూ అతడిని బాగా ప్రోత్సహిస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ఇక కొద్ది నెలల క్రితం నానికి పోటీగా ఉన్న యంగ్ హీరో సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయినప్పుడు నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు.టాలీవుడ్లో చాలా మంది హీరోల ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
సోషల్ మీడియాలో సదరు హీరో సినిమా ప్లాప్ టాక్ను బాగా స్ప్రెడ్ చేశారు.ఆ రోజు చాలా మంది సూపర్ స్టార్ హీరోల అభిమానులు కూడా ఆ సినిమాపై నెగిటివ్ కామెంట్లు విపరీతంగా స్ప్రెడ్ చేశారు.
ఇక సదరు హీరో నాని కలిసి గతంలో ఓ సినిమాలో కూడా నటించారు.తర్వాత వీరి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో కాని వీరి గ్యాప్పై ఎప్పటికప్పుడు కొత్త రూమర్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.