బుల్లితెర యాంకర్ అనసూయకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఒకవైపు యాంకర్ గా పని చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ అనసూయ అభిమానులను సంపాదించుకున్నారు.
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించడం అనసూయకు సొంతం.ఇంటర్వ్యూల ద్వారా, లైవ్ చాట్ ద్వారా అభిమానులతో విశేషాలు పంచుకునే అనసూయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
తన మనసులోని భావాలను పంచుకుంటూ అభిమానులకు ఎవరికీ తెలియని రహస్యాలను చెప్పారు.తనకు మరో జన్మ ఉంటే ఏనుగులా పుట్టాలని ఉందంటూ అనసూయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాను ఏనుగులా ఎందుకు పుట్టాలని అనుకుంటుందో కూడా అనసూయ సవివరంగా వెల్లడించారు.ఇతర జాతులతో పోలిస్తే ఏనుగు జాతి భిన్నమని… ఏనుగు జాతిలో ఒక జంటలో ఒక ఏనుగు చనిపోతే మరో ఏనుగు ఆకలితో అలమటించి చనిపోతుందంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఆడ ఏనుగు ముసలిదైనా చివరి వరకు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తుందని అందుకే మళ్లీ జన్మంటూ ఉంటే ఏనుగుగా పుట్టాలని ఉందంటూ అనసూయ పేర్కొన్నారు.అనసూయ ఏనుగు గురించి, ఏనుగులా పుట్టాలని అనుకోవడానికి గల కారణాల గురించి చెప్పిన విధానాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో నెటిజన్ల ట్రోలింగ్ గురించి కూడా అనసూయ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మొదట్లో ట్రోలింగ్ ను చూసి భయపడేదానినని తరువాత కాలంలో ట్రోలింగ్ అలవాటైపోయిందని చెప్పారు.
టీవీ రంగంలోకి అడుగు పెట్టకముందు 5 వేల రూపాయల కోసం బ్యాంక్ లో టెలీకాలర్ గా పని చేశానని తెలిపారు.