కొందరు కళాకారుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది.ఆ ప్రతిభను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
అసలు ఈ విధంగా సాధ్యమవుతుందా…? అనేలా అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే కళాకారులు భూమిపై ఎంతో మంది ఉన్నారు.కొందరు శ్రమ, అదృష్టం వల్ల మంచిపేరు తెచ్చుకుంటే కొందరు ఆ అదృష్టం లేకపోవడం వల్ల ప్రపంచానికి పరిచయం కాకుండా మనలో ఒకరిగా మిగిలిపోతూ ఉంటారు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక కళాకారుడికి సంబంధించిన పెయింటింగ్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. రవివర్మ, ఎం ఎఫ్ హుస్సేన్ లాంటి చిత్రకారుల టాలెంట్ కు సరితూగేలా ఉన్న పెయింటింగ్ వార్తల్లో నిలిచింది.
సోషల్ మీడియా ప్రాధాన్యత వల్ల ఇలాంటి టాలెంట్ వెలుగులోకి వస్తోంది.ఇంతలా చెప్పుకుంటున్న ఈ పెయింటింగ్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ఒక కళాకారుడు సాధుజంతువులపై తన టాలెంట్ తో అద్భుతమైన పెయింటింగ్ వేశాడు.
కళాకారుడు గేదె పై స్త్రీ, పురుషుడు బొమ్మలు ఉండేలా చేసి గేదె నడిచే సమయంలో మనిషి నడుస్తున్నట్లు అనిపించేలా చేశాడు.
మరో ఆవు పెయింటింగ్ ను తన టాలెంట్ తో అద్భుతంగా వేశాడు.దూరం నుంచి చూస్తే ఇద్దరు మనుషులు నడిచి వెళుతున్నారేమో అని అనిపించే విధంగా పెయింటింగ్ ఉంది.
ఈ పెయింటింగ్స్ ఎవరు వేశారో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట్లో ఈ పెయింటింగ్స్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.