బాలీవుడ్ లో నెపోటిజంఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.కంగనా లాంటి వారు బాలీవుడ్ లో నెపోటిజం మాఫియానే సుశాంత్ మరణానికి కారణం అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.
ఆ ఇష్యూని ఇంకా లాగుతుంది.ఇక ఈ వ్యవహారం తీసుకొచ్చి కొంతమంది తెలుగు చిత్రపరిశ్రమకి కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అంటూ నట వారసులు గురించి చెబుతున్నారు.వారి కోసం చాలా మందిని పైకి రాకుండా అడ్డుకుంటున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు.
అయితే దీనిపై తాజాగా తన యుట్యూబ్ చానల్ ద్వారా నాగబాబు రియాక్ట్ అయ్యారు.నెపోటిజం అనే మాట ఉపయోగిస్తున్నారు అంటే వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయలేదని, ఎంతో మంది కొత్త వాళ్ళు టాలీవుడ్ లో తమ టాలెంట్ తో ఎదిగి స్టార్ హీరోలుగా మారారు.
వారి ఎదుగుదలని ఎవరూ అడ్డుకోలేదు.అలాగే సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి వస్తామంటే కచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం.అయినంత మాత్రాన వాళ్ళు స్టార్స్ అయిపోరు.ఎవరికైనా ఒకటి రెండు సినిమాల వరకే వారసత్వం పనికొస్తుంది.
తరువాత వారి సొంత ఇమేజ్ తోనే ఎదగాలి.సొంత టాలెంట్ ని నమ్ముకుంటేనే స్టార్ హీరోలుగా ఎదుగుతారు.
ఎంతో మంది సినిమా కుటుంబాల నుంచి వచ్చి నిలబడలేక మరల వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు ఎవరైనా తమ సొంత టాలెంట్ తో ఎదిగినవాల్లె.
ఈ తరంలో కూడా స్టార్ వారసులుగా వచ్చిన వాళ్ళు తమ సామర్ధ్యంతో ఎదుగుతూ అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకి వెళ్తున్నారు తప్ప ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ని నమ్ముకొని ఎదగడం లేదనే విషయం అందరూ తెలుసుకుంటే మంచిది అని నాగబాబు కామెంట్స్ చేశారు.
.