కరోనా వైరస్.ప్రపంచ ప్రజలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు రెండు కోట్ల 35 లక్షలమందికిపైగా వ్యాపించింది.ఇక అందులో 8 లక్షలమంది ప్రజలకుపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.
అయితే కరోనా వైరస్ లక్షలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేసేవారు .
కానీ ఇప్పుడు కరోనా వైరస్ లక్షణాలు ఏవి లేకపోయినప్పటికి పరీక్షా చేయిస్తే కరోనా పాజిటివ్ వస్తుంది.కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు లేకపోయినా చాలామందికి కరోనా టెస్టుల్లో పాజిటివ్ వస్తోంది.ఇక ఏపీలోని పలు జిల్లాల్లో నిర్వహించిన సిరో సర్వేలైన్స్ సర్వేలో ఇలా పాజిటివ్ వచ్చిన ఆధారాలు చూపిస్తుంది.
ఇక అలానే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో 99.5% మందికి, తూర్పు గోదావరి జిల్లాలో 92.8%, కృష్ణాలో 99.4% నెల్లూరులో 96.1% మందికి కరోనా లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.ఇక అలా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి కేవలం పదిరోజుల్లోనే నెగటివ్ వస్తుంది.
హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ పది రోజులు ఉండి సరైన చికిత్స తీసుకొని మంచి ఆహారం తింటే కరోనా వైరస్ నెగటివ్ వస్తుందని సర్వేలో తేలింది.