కరోనా తో క్షీణించిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ప్లాస్మా థెరపీ చేయనున్నట్లు తాజాగా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.ఈ నెల 5 వ తారీఖున కరోనా లక్షణాలతో చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
అయితే అప్పటినుంచి ఆయన కరోనా కు చికిత్స పొందుతుండగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం తో ప్రస్తుతం ఆయనకు రెండు రోజుల నుంచి వెంటిలేటర్ పైనే వైద్యం అందిస్తున్నారు.అయితే ఆయన వయసు కూడా ఎక్కువగా ఉండడం తో ఆయనకు ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుండడం తో ఆయనకు ప్లాస్మా థెరపీ ఇవ్వడానికి ఆసుపత్రి వర్గాలు సిద్ధమయ్యాయి.
కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన మొన్నటి వరకు నిలకడగా ఉన్నప్పకిటీకీ తాజాగా విషమంగా మారడంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో బాలు ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకోవడం కోసం తాజాగా తమిళనాడు మంత్రి విజయ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రి కి వెళ్లి బాలును పరామర్శించి, ఆయన చికిత్సకు సంబంధించిన వివరాల్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా ఎస్పీ బాలుకు అయ్యే వైద్య ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని, ప్లాస్మా థెరపీ కూడా అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ప్లాస్మా థెరపీ తో ఆయన చికిత్స అందించనుండగా మరో రెండు రోజుల పాటు ఆయనను వెంటిలేటర్ పైనే ఉంచనున్నట్లు సమాచారం.ఒకపక్క కరోనా కారణంగా బాలు ఆరోగ్య పరిస్థితి ఇలా విషమంగా మారిన ఈ సమయంలో ఆయన సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే.