భార్యను తీసుకురావాలని తల్లిపై వేధింపులు .. చివరికి ఆ తల్లి !

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తరచూ ఇంట్లో భార్యతో గొడవపడే వాడు.దీంతో విసుగు చెందిన భార్య హైదరాబాద్ వెళ్లిపోయింది.

 Mother Hires Killers To Murder Son, Arrested By Prakasam Police,  Police, Prakas-TeluguStop.com

దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి తన తల్లి దగ్గరికి వెళ్లి తన భార్యను ఇక్కడికి తీసుకుని రా.లేదా నా కోరికలు తీర్చు అని వేధించసాగాడు.పరువు పోతుందని ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు ఆ తల్లి.దీంతో ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు.వేధింపులకు భరించలేని తల్లి తన కొడుకును చంపాలని తన సోదరుడి సాయంతో కొందరికి సుపారీ అందించి హత్య చేయించింది.

కన్న కొడుకునే తల్లి హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన కుంచాల మాల్యాద్రి, లక్ష్మమ్మదంపతులకు కొడుకు నరసింహారావు.అతడికి 15 ఏళ్లి క్రితం వివాహం జరిగింది.

ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.మద్యానికి బానిసైన నరసింహారావు తరచూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు.

భర్తకు నచ్చజెప్పిన మారకపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయింది.భార్య దూరం కావడంతో నరసింహారావు తన తల్లి దగ్గరికి వెళ్లి భార్యను తీసుకురమ్మని, లేదా నువ్వే కోరికలు తీర్చమని అసభ్యంగా మాట్లాడేవాడు.

నరసింహారావు తండ్రి పక్షవాతంతో మంచాన పడటంతో మరింత రెచ్చిపోయాడు.దీంతో తల్లి తన సోదరుడి సాయంతో రూ.1.70 లక్షలు సుపారి ఇచ్చి చంపించింది.పోలీసులు మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించడంతో అసలు విషయం బయటపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube