రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం సమసి పోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందేమో అనే అనుమానాలకు చెక్ పెట్టేశారు.
తిరుగుబాటు జెండా ఎగురు వేసిన సచిన్ పైలెట్ అధినాయకత్వం బుజ్జగింపులతో మళ్లీ పార్టీలో చేరిపోయాడు.ఎవరిపై అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించాడో మళ్లీ ఆయనకు బాసటగా నిలిచి విశ్వాస పరీక్ష నెగ్గేలా చేశాడు.
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు ఎలాంటి ఢోకా లేదని తేలిపోయింది.అసెంబ్లీలో సీఎం అశోక్ గహ్లోత్ బల పరీక్షలో ఈజీగా గెలుపొందారు.
బీజేపీ ఆశలపై నీళ్లు జల్లుతూ సచిన్ పైలెట్ వర్గం సీఎంకు మద్దతుగా ఓట్లు వేయడం జరిగింది.
అధికార మరియు విపక్షల మద్య వాడి వేడి చర్చ జరిగింది.
కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంను పడగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని, కాని న్యాయం తమవైపు ఉండటం వల్ల మేమే గెలిచాం అంటూ సీఎం గహ్లోత్ అన్నారు.ఈ సందర్బంగా తిరుగుబాటు జెండా ఎగుర వేసి రచ్చ చేసిన సచిన్ పైలట్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడం చాలా సంతోషంగా ఉంది.
ప్రజల కోసం అందరం కలిసి పని చేయాలని భావించాం అన్నాడు.బీజేపీ ప్రోద్బలంతో సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరిగినా కూడా ఆయన మాత్రం బీజేపీకి మద్దతుగా వ్యవహరించలేదు.
తనకు పార్టీలో ప్రాముఖ్యత దక్కడం లేదు అనే ఉద్దేశ్యంతోనే ఆయన వెళ్లాడు తప్ప బీజేపీ ఇక్కడ ఏం కుట్రలు చేయలేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.