తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “జల్సా” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన పార్వతి మెల్టన్ తెలుగు ప్రెకషకులకి సుపరిచితమే.అయితే ఈమె తెలుగులో దాదాపుగా ఎనిమిది కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినప్పటికీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఎక్కువ కాలం హీరోయిన్ గా సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.
దీంతో ప్రస్తుతం తన జన్మ స్థలమైన “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా” లో తన భర్తతో కలిసి నివాసముంటోంది.అయితే తాజాగా పార్వతి మెల్టన్ ఓ ప్రముఖ పత్రిక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా తాను సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న టువంటి సంఘటనల గురించి తెలిపింది.అయితే ఇందులో టాలీవుడ్ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ దర్శకుడు ద్వారా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నానాని తెలిపింది.
అయితే సినీపరిశ్రమకు వచ్చిన మొదట్లో చాల బాగుండేదని కానీ ఓ హీరో మరియు దర్శకుడు చేసిన మోసం కారణంగా తన పూర్తి సినీ జీవితం నాశనం అయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.కానీ ఆ దర్శకుడు, హీరోల పేరు మాత్రం పార్వతి మెల్టన్ చెప్పడానికి ఇష్ట పడలేదు.
అలాగే ప్రస్తుతం తన సినీ జీవితాన్ని మర్చిపోయి తన భర్తతో సంతోషంగా గడుపుతున్నానని తెలిపింది.దీంతో ఆ పార్వతి మెల్టన్ ని మోసం చేసినటువంటి ఆ హీరో మరియు దర్శకుడు ఎవరో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
చివరిగా పార్వతి మెల్టన్ తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో సాయిరాం శంకర్ హీరోగా నటించిన “యమహో యమ” అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో నటించలేదు.
అంతేగాక అప్పట్లో పాన్ ఇండియా తరహాలోని ఓ చిత్రంలో నటించినప్పటికీ అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.