ఇంతవరకు మనం గేదె, ఆవు, మేక పాల గురించి విన్నాం, వాటిని తాగాము కూడా.అయితే ఇప్పుడు పాల ఉత్పత్తి కోసం చాలా రకాల పాడి పశువులను పెంచుతున్నారు.
అయితే మనం పాల కోసం ఆవు, గేదె ల నుండి వచ్చే పాలను డైరీల ద్వారా పొందగలుగుతుంది.ఇకపోతే తాజాగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా గాడిద పాలు తయారు చేసే డైరీని మొదలు పెడుతున్నారు.
భారతదేశంలోని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ ఈ కార్యక్రమానికి ప్రణాళికలను రూపొందించింది.
ఈ డైరీ కోసం ఇప్పటికే 10 హాలరి జాతి గాడిదలను సైతం కొనుక్కునేందుకు ఆర్డర్ ఇచ్చింది.
రోగ నిరోధకశక్తిని పెంపొందించే వైద్యంలో గాడిదపాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు తెలిపారు.అంతేకాదు ఈ పాలు వలన చిన్న పిల్లలకు వచ్చే జబ్బులకు మంచి ఔషధంగా పనిచేస్తాయని తెలుస్తోంది.
అయితే ఈ గాడిదపాలు ధర వింటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే.ఈ ఔషధాలు ఏకంగా ఒక్క లీటర్ దాదాపు 3 వేల నుండి 7 వేల ధర పలుకుతాయి అని తెలుస్తోంది.
దీనికి ఇంత ఖరీదు గల కారణం రోగ నిరోధక శక్తి పెంపొందించడమే.కాబట్టి అనేక వ్యాధులకు పోరాడగలిగే రోగనిరోధకశక్తి ఈ పాలలో ఉండడంతో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి శాస్త్రవేత్తల సహాయాన్ని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ కోరింది.
ఇకపోతే ఈ ప్రక్రియ గాడిదల రీడింగ్ తర్వాత మొదలవుతుందని నేషనల్ హార్స్ రీసెర్చ్ సెంటర్ అధికారులు తెలిపారు.ఈ పాలలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
అంతేకాదు ఈ గాడిద పాలతో ఇప్పటికే సబ్బులు, బాడీ లోషన్ లాంటి సౌందర్య ఉత్పత్తులను దేశంలో తయారీ మొదలుపెట్టారు.