మనది అని ఏదైనా ఉంటే, అది ఎప్పటికైనా మన చేతికి చేరుతుంది.లేదంటే లేదు.
దీనికి సరిగ్గా సరిపోయే ఈ సంఘటన ఒకటి తాజాగా ముంబై నగరంలో చోటు చేసుకుంది.అది ఎలా అంటే… ఓ వ్యక్తి ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న తన పర్సు ఇప్పుడు దొరికింది.2006లో పోగొట్టుకున్న అతడి పర్సు 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికిందని పోలీసులు సమాచారం ఇచ్చారు.
అతను పరుసు పోగొట్టుకున్న సమయంలో ఎంత వెతికినా దొరకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు.
అలా పోగొట్టుకున్న పర్స్ లో 900 రూపాయలు ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చాడు.అలా 14 సంవత్సరాలు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు పరిష్కరించబడింది.
తాజాగా ఈ విషయంపై సదరు వ్యక్తికి పోలీసుల నుండి ఫోన్ వచ్చింది.తాను పోగొట్టుకున్న పర్స్ దొరికిందని వాళ్ళు చెప్పారు.పోలీసులు అలా చెప్పడంతో తాను ఆ విషయాన్ని తొందరగా గుర్తు పట్టలేకపోయాడు.పూర్తి వివరాలు తెలపడంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన పర్స్ లోని తొమ్మిది వందలలో ఒక వంద రూపాయలు స్టాంపు డ్యూటీ లో కింద కట్ చేశారు.అలా అతనికి 800 తిరిగే రాగా, అందులో మోడీ ప్రభుత్వం రద్దు చేసిన రూ.500 నోటు ఉంది.దీంతో అతనికి కేవలం మూడు వందలు మాత్రమే వచ్చినట్లయింది.అయితే ఆ పాత రూ.500 రూపాయల నోటు ను మార్చి ఇస్తామని తెలిపారు పోలీసులు.