ఓ శిశువు ఒంటి కన్నుతో జన్మించాడు.ఆ పిల్లాడిని చూసి అందరూ ఆశ్యర్యపోయారు.
ఆ శిశువుకు ఒంటి కన్ను నుదురు మధ్య భాగంలో ఉంది.ముఖంలో కేవలం ఒక కన్ను, పెదవి తప్ప మరేవీ లేదు.
పుట్టిన కొద్ది సేపటికే ఆ పిల్లాడు మరణించాడు.
ఈ అరుదైన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా కోటప్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంక నిండు గర్భిణి.పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పురిటి నొప్పులు అధికంగా రావడంతో ఆస్పత్రి ఆవరణలో శిశువుని జన్మనిచ్చింది.పుట్టిన పిల్లాడి ముఖంలో ఒంటి కన్ను, పెదాలు తప్ప ఇంకేమీ లేదు.
చికిత్స అందించిన డాక్టర్లు, సిబ్బందిని మొదట చూసి ఆశ్చర్యపోయిన దాని తర్వాత శిశువుకు చికిత్స అందజేశారు.వైద్యం అందిస్తుండగానే శిశివు చనిపోయాడు.ఒంటి కన్నుతో పిల్లాడు జన్మించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.ఇలాంటి పరిణామాలతో ఏం దారి తీస్తాయో అని వాపోతున్నారు.
అయితే డాక్టర్లు మాట్లాడుతూ.గర్భధారణ సమయంలో గర్భిణి రేడియేషన్ కి గురైందని, రేడియేషన్ ప్రభావం ఎక్కువ అయి పిల్లాడు అలా పుట్టాడని చెప్పుకొచ్చారు.
ఇలాంటి ఘటనలు అరుదుగా నమోదవుతుంటాయని డాక్టర్లు చెప్పుకొచ్చారు.