వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణకు కేంద్రం శుభవార్త అందించింది.ఆయనకు వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లు కేంద్రం బుధవారం రాత్రి వెల్లడించింది.10 మంది వరకు భద్రత బలగాలు ఉంటారని తెలిపింది.దీనికి సంబంధించి అధికారికంగా ఈ రోజు ఉత్తర్వులు రావొచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం తన నియోజకవర్గ పర్యటనను సరికాదని స్పష్టం చేశారు.కరోనా లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి పర్యటనలకు వెళ్లడం లేదన్నారు.
లాక్ డౌన్ ముగిసిన తర్వాతే జిల్లా కలెక్టర్లతో చర్చించి పర్యటనకు వెళతానని తెలిపారు.
గతంలో వైఎస్సార్ సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అతనికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో అల్లర్లు చేస్తున్నారని, దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారని, నియోజకవర్గంలోకి వెళ్లలేకపోతున్నానని, తనకు భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలతో తనకు ప్రాణ హాని ఉందని భద్రత బలగాలను అందించాలని కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కేంద్ర మంత్రులు వై కెటగిరీ భద్రత బలగాలను అందించనున్నట్లు తెలిపింది.అధికారింగా గురువారం ఉత్తర్వులు రావచ్చని, సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారని ఎంపీ చెప్పుకొచ్చారు.