క్రియేటివ్ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్.రంగస్థలంకి ముందు ఎక్కువగా లాజికల్ గా సినిమాలు తీస్తూ సాధారణ ప్రేక్షకులకి అర్ధం కానీ కథం, కథనాలతో ప్రయోగాలు చేసే సుకుమార్ రంగస్థలంతో ఒక్కసారిగా ఎమోషనల్ ఎలిమెంట్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు.
ఆ సినిమాతో టాలీవుడ్ అందరూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ కథలు ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపించేలా చేశాడు.రంగస్థలం లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తర్వాత మరో సారి బన్నీతో ఇంచు మించు అలాంటి జోనర్ లోనే ఫారెస్ట్ నేపధ్యంలో గంధపు చెక్కల దొంగతనం ఎలిమెంట్ తో పుష్ప సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు.
కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా ప్రస్తుతం వాయిదా పడింది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ సినిమా కూడా ప్రస్తుతం వాయిదా పడిపోయింది.అయితే రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లకి సంబంధించి ఈ ఖాళీ సమయంలోనే కథలని సిద్ధం చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది.
చాలా మంది దర్శకులు చెప్పే కథలని రామ్ చరణ్ ఈ లాక్ డౌన్ సమయంలో విన్నాడని టాక్.తాజాగా సుకుమార్ కూడా రామ్ చరణ్ ఓ మంచి స్టోరీ లైన్ చెప్పడం జరిగిందని, అది చరణ్ కి బాగా నచ్చడంతో దానికి లాక్ చేసినట్లు బోగట్టా.
ఈ నేపధ్యంలో సుకుమార్ కూడా ఈ స్టోరీ లైన్ పై పూర్తి స్థాయి కథ సిద్ధం చేయమని తన టీమ్ కి సూచించినట్లు సమాచారం.అన్ని అనుకూలంగా జరిగితే రెండేళ్ల తర్వాత పుష్ప సినిమా తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ ని మరోసారి తెరపై చూసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.