నమ్మి తన వెంట వచ్చిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.స్నేహితులే కామాంధలుగా మారి అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు చిత్రించి పైశాచిక ఆనందాన్ని పొందారు.అనంతరం విషయం బయట ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని నిందితులు బెదిరించడంతో ఆ మైనర్ బాలిక భయపడి ఎవరికి చెప్పలేదు.
నిందితుడిలో ఒకడు ఆ వీడియోను బాధితురాలికి పంపించి వేధింపులకు పాల్పడటంతో అసలు విషయం బయటపడింది.
ఆరుగురు యువకులు కలిసి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా నగరంలో చోటు చేసుకుంది.
స్నేహితులని నమ్మి వెళ్లిన మైనర్ బాలిక ఆ యువకుల చేతిలో చిక్కుకుని నరక యాతన అనుభవించింది.ఆరుగురు కామాంధులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు.
విషయం పొక్కి ఉంచడానికి బ్లాక్ మొయిల్ చేశారు.కాగా, నలుగురిలో ఒక యువకుడు రోజూ వీడియోలు పంపించి వేధించడంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.వీరిపై రకరకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
కాగా, ఆ ఆరుగురిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.