తెలుగులో ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన “నచ్చావులే” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ మాధవీలత గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే మాధవీలతనటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో సినిమా అవకాశాలు లేక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి చేరింది.
ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ లో చేరి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి దారుణంగా పరాజయం పాలయింది.
అయినప్పటికీ పట్టు విడవకుండా పార్టీ కార్య కలాపాల్లో బాగానే పాల్గొంటుంది.
అయితే ఈ క్రమంలో తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా మాధ్యమాలలో మాధవీ లత చేస్తున్నటువంటి కామెంట్లపై స్పందించింది.ఇందులో భాగంగా అన్నీ తెగించి రాజకీయాల్లోకి వచ్చానని, అంతేగాక తన పార్టీ తప్పు చేసినా సరే కచ్చితంగా నిలదీస్తానని చెప్పుకొచ్చింది.
తనకు మన, తన అనే భేదాలు లేవని ప్రజలకు మంచి చేస్తే ఖచ్చితంగా సమర్థిస్తానని తెలిపింది.అయితే ప్రస్తుతం భాజపా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాధవీలత పై సోషల్ మీడియా మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు మరియు అసభ్య పదజాలం ఉపయోగించి కామెంట్లు చేసిన వారిపై ఘాటుగా విమర్శలు చేసింది.అంతేగాక ఒక అమ్మ, అబ్బకి పుట్టిన వారైతే తన గురించి ఇలా అసభ్యకరంగా కామెంట్లు చేయరని ఆగ్రహం వ్యక్తం చేసింది.