దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది.తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో కరోనా చికిత్స నిమిత్తం అమిత్ షా ఆస్పత్రిలో చేరారు.తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు.
కరోనా పాజిటివ్ గా తేలినట్టు అమిత్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా సూచించారు.అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
బాల గంగాధర్ తిలక్ 100వ వర్థంతి సందర్భంగా శనివారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఆ ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని.
కరోనా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.