తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఈ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులను కొంతకాలం పాటు వాయిదా వేసినప్పటికీ ఇటీవలే షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఈ చిత్ర షూటింగ్ పనులను కూడా చిత్ర యూనిట్ సభ్యులు షురూ చేశారు.
అయితే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న “మహేష్ బాబు” కి తన భార్య నమ్రత శిరోద్కర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో ముఖ్యంగా ముద్దు సన్నివేశాలకు మాత్రం కొంత మేర దూరంగా ఉండమని, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గినప్పుడు కావాలంటే అలాంటి సన్నివేశాల చిత్రీకరణ జరపవచ్చని చిత్ర యూనిట్ సభ్యులకు కూడా సూచించినట్లు కొందరు టాలీవుడ్ సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.
అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తున్నట్లు సమాచారం.కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.
.