రాజధానుల ఏర్పాటుతో వైసీపీ సంబురాలు

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదం లభించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో శనివారం ఉదయం జగదాంబ కూడలి వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిశేకం చేశారు.

 Ycp Sambura With The Formation Of Capitals, Ycp, Formation,three Capitals, Ap C-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా సంబురాలు చేసుకున్నారు.

ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరంగా మారుతుందని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డాడన్నారు.ఆయన తీసుకున్ననిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు.

ఎవరెన్నీ రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నించినా సీఎం జగన్ చివరకు అనుకున్నది సాధించారు.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.

త్వరలో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.

ఎమ్మెల్యే శెట్టి పాల్గొన మాట్లాడుతూ.

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేశారు.

దీని వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగనుంది. కరోనా కట్టడిలోను, రాష్ట్ర పరిపాలనలోను సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube