కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు.ఎందుకంటే మనకే తెలియకుండా మనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయ్.
ఇంకా ఈ నేపథ్యంలోనే మరిగే నీటిలో కరోనా మరణిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.నీటి గురించి అసలు సైంటిస్టులు ఎం చెప్తున్నారు అనేది ఇక్కడ చూద్దాం.
గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిలో కరోనా వైరస్ కేవలం 72 గంటల వరకు మాత్రమే జీవించి ఉంటుందని టర్కీలోని స్టేట్ రీసెర్చి సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ వెక్టార్ సైంటిస్టుల పరిశోధనలో తాజాగా వెల్లడైంది.నీరు మరిగే ఉష్ణోగ్రత వద్ద అయితే కరోనా వైరస్ అసలు బతికి ఉండదని వెంటనే చచ్చిపోతుందని వారు తెలిపారు.
కాగా గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిలో ఉండే వైరస్ లో 24 గంటల్లో 90 శాతం వైరస్ చనిపోతుందని, 99.99 శాతం వైరస్ చనిపోయేందుకు 72 గంటల సమయం పడుతుందని అదే నీరు బాగా మరిగితే అందులో ఉన్న కరోనా వైరస్ వెంటనే చచ్చిపోతుందని వారు తెలిపారు.నీటి ఉష్ణోగ్రత బట్టి కరోనా వైరస్ జీవితకాలం ఉంటుందని వారు తేల్చి చెప్పారు.కాగా స్టెయిన్లెస్ స్టీల్, లినోలియం గ్లాస్, ప్లాస్టిక్, సెరామిక్ ఉపరితలాలపై కరోనా వైరస్ 48 గంటలకు మించి ఉండదని సైంటిస్టులు తెలిపారు.