టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.
ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సక్సెస్ అందుకోవడానికి సమయం తీసుకున్న ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో రూల్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో బాలీవుడ్ లో మూడు సినిమాలతో పాటు తెలుగులో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలు కూడా సెట్స్ పైన ఉంది.
ఇక ఎన్ఠీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం ఈమెని తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసినట్లు తెలుస్తుంది.
తన నెక్స్ట్ సినిమాలకి రెండు కోట్లు పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని, అంత ఇస్తేనే చేస్తానని చాలా స్పష్టంగా చెప్పెస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.డిమాండ్ ఉన్నప్పుడు కావాల్సినంత అడిగి తీసుకోవాలి అనే నార్త్ భామల పాలసీని ఈ మంగళూరు బొమ్మ కూడా ఫాలో అవుతుందని ఇప్పుడు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
ఇక పూజా పాపకి ఉన్న డిమాండ్ నేపధ్యంలో నిర్మాతలు కూడా సరే అని అంత ఇవ్వడానికి మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తుంది.స్టార్ హీరోలు కూడా పూజా హెగ్డే కావాలని డిమాండ్ చేయడంతో తప్పక నిర్మాతలు ఆమె అడిగిన రెండు కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.