తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన ఆరు కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ లను ప్రభుత్వానికి అందజేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.గురువారం ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి మంత్రి కేటీఆర్ జెండా ఊపి కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు ముందుకొచ్చారు.
త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కు తెలిపారు.ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంబులెన్సులు కొవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేయనున్నాయి.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతోందని పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.