క్రికెట్ వరల్డ్ కప్ అయినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అయినా సరే ఆట ప్రారంభం అయ్యే ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించేటువంటి స్పోర్ట్స్ యాంకర్ మయంతి లంగర్ గురించి క్రీడా అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె ముందుగా ఫుట్ బాల్ ఆటకి సంబంధించిన మ్యాచ్లలో యాంకరింగ్ నిర్వహిస్తుండేది.
క్రమక్రమంగా క్రికెట్ పాటకు మంచి ఆదరణ పెరుగుతుండడంతో ఇటుగా అడుగులేసింది.
ఈ క్రమంలో నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లలో పాల్గొని తన సేవలను జట్టుకు అందించినటువంటి భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ ని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.
అయితేమయంతి లంగర్ విద్యాభ్యాసం ఇతర దేశాలలో కొనసాగడంతో ఈ అమ్మడు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడుతూ తన గలగల మాటలతో క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.అయితే క్రీడలను ప్రసారం చేసేటువంటి స్టార్ స్పోర్ట్స్, జీ స్పోర్ట్స్, ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ తదితర టెలివిజన్ ఛానళ్లలో ఇప్పటివరకూ ఈ అమ్మడు యాంకరింగ్ నిర్వహించింది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేకపోవడంతో ఇంటి వద్దనే ఖాళీగా ఉంటోంది. అయితే ప్రస్తుతం మయంతి లంగర్కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నట్లు సమాచారం.