తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగిందది.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.
బ్రహ్మనందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.2020-21 సంవత్సరంలో రుణాల లక్ష్యం రూ.2,51,600 కోట్లు అని తెలిపారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.78 శాతం అధికమని స్పష్టం చేశారు.వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలను అందిచడమే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు.సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ.39,600 కోట్ల రుణాలు, విద్యా రుణాలు రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాలు రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణాలు రూ.410 కోట్లు, పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగానికి రూ.454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.ఇక ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలు ఇవ్వడమే లక్ష్యమని అన్నారు.